Lockdown In Guwahati: గువహటి: కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో అసోం రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని గౌహతీ ( Guwahati Lockdown ) లో జూన్ 29, ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్టు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ ( Covid -19 )నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసాం సర్కార్ స్పష్టంచేసింది. కరోనావైరస్ పాజిటివ్ కేసులను ( Coronavirus ) నివారించడానికి అసోం ప్రభుత్వం ఆదివారం నుంచి మరోసారి లాక్‌డౌన్‌ను విధించనుంది. ఈ మేరకు  ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన చేసింది. ఇక నుంచి రాత్రి సమయంలో కర్య్ఫూ అమలులో ఉండనున్నట్టు ప్రకటించారు. ( Also read: CBSE board exams results 2020: సీబీఎస్ఈ ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్స్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసోంలో ( Total COVID-19 cases In Assam ) ఇప్పటి వరకు మొత్తం 6321 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 9 మంది కరోనా వల్ల మరణించారు. అన్‌లాక్ -1 ( Assam ) అమలులోకి వచ్చిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు అస్సాంలోని తమ తమ స్వస్థలాలకు తిరిగి రావడం కొనసాగుతోంది. దీంతో కేసుల సంఖ్య వేగంగా పెరిగింది. వైరస్ మరింతగా సంక్రమించకుండా ( Corona Pandemic ) ఉండేందుకు రాజధాని గౌహతిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma ) పేర్కొన్నారు. ( Also read: Prabhakar: ప్రభాకర్ వల్లే మరో బుల్లి తెర నటుడికి కరోనా ? )


గౌహతిలో రెండు వారాల లాక్‌డౌౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు, మందులు షాపులకు మాత్రం అనుమతి ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. లాక్‌డౌన్ విధించే లోగా జనం నిత్యవసరాల సరుకులు సమకూర్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..