ఒక కొడుకు తన తల్లిని సంతోషపెట్టలేదని ఇద్దరి పెళ్లాలను కడతేర్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్తాన్ లో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. దీపారాం అనే వ్యక్తి దరియా దేవి(25), మాలి దేవి(27) అనే ఇద్దరు యువతులను పెళ్ళిచేసుకున్నాడు. మంగళవారంరోజు బంగారం కొనిస్తానని చెప్పి ఇద్దరినీ కారులో ఎక్కించుకున్నాడు. కారులో తీసుకెళ్తున్న క్రమంలో రాం.. తన తల్లి విషయంలో ఇద్దరి భార్యలతో గొడవపడ్డాడు. వారిలో ఒకరు కేకలు వేస్తూ కారు దిగే ప్రయత్నంచేయగా.. ఆమెను బలవంతంగా కోరులోకి తోసేసి వాహనానికి నిప్పుపెట్టాడు. దీంతో ఆ ఇద్దరు భార్యలు కారులోనే సజీవదహనమయ్యారు. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేరం ఒప్పుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడంతో.. పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు.