Asaduddin Owaisi | గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రచార కార్యక్రమం సందర్భంగా కొంత మంది ముస్లీం మహిళలు ఆయన్ను నిలదీశారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంగా రూ.10 వేల ఇస్తాను అని ప్రకటించింది లక్షలాది మందికి అందించిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1.Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్ 


అయితే తమకు వరద సహాయం అందలేదు అని పలువురు మహిళలు ఓవీసీని (Asaduddin Owaisi) నిలదీశారు. కష్టాల్లో ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదు అని.. కానీ ఓట్లు అడిగే సమయంలో గుర్తుకు వచ్చాం అని విమర్శించారు. ప్రజల విమర్శలు విన్న తరువాత వారితో మాట్లాడడానికి ప్రయత్నించారు ఓవైసీ కానీ పరిస్థితి సరిగ్గా లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.



Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు 


జాంబాగ్ డివిజన్ లో ఎంఐఎం తరపు క్యాండిడేట్ కోసం అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహించడానికి అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ( GHMC Elections 2020 ) ఎంఐఎం పార్టీ మొత్తం 52 స్థానాల్లో పోటీ చేస్తోంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR