మరాఠా ఉద్యమం వేళ్లూనుకున్న మహారాష్ట్రలో మరో ఉద్యమానికి తెరలేవనుందా.. ?  పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి గతంలో ఇతర రాష్ట్రాల వారిని తరిమికొట్టిన విధంగా.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి..  శరణార్థులుగా ఉంటున్న వారిని మహారాష్ట్ర నుంచి తరిమి కొట్టనున్నారు. ఇందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నుంచి ఓ నాయకుడు ముంబైలో ఏర్పాటు చేసిన ఫ్సెక్సీ పోస్టరే ఉదాహరణగా నిలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని పన్వెల్  ప్రాంతంలో ఈ పోస్టర్ వెలిసింది. మహారాష్ట్రలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదీశీయులారా .. పాకిస్తానీయులా .. మర్యాదగా ఈ దేశం విడిచి పెట్టి వెళ్లండి. లేని పక్షంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చూస్తూ ఊరుకోదు. అందరినీ తరిమి తరిమి కొడుతుందని ఆ ఫ్లెక్సీలో రాశారు. పన్వెల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో MNS చీఫ్ రాజ్ థాక్రేతోపాటు ఆయన కుమారుడు అమిత్ థాక్రే ఫోటోలు కూడా ఉన్నాయి.  నిజానికి మహారాష్ట్రలో ఈ నెల 9న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పెద్ద ర్యాలీ నిర్వహించనుంది. ఇంతకు ముందుగానే ఈ పోస్టర్ వెలియడం.. చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే అక్రమ చొరబాటుదారులను తిప్పి పంపిస్తామని కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన స్పష్టం చేసింది.



పౌరసత్వ సవరణ చట్టం-2019పై చర్చ జరగాలని MNS చీఫ్ రాజ్ థాక్రే అన్నారు. కానీ అక్రమంగా ఇతర దేశాల నుంచి చొరబడిన వారికి ఎందుకు చోటు ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో మరో ఉద్యమం తప్పదని తెలుస్తోంది.