Delta plus varient: దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో తొలి డెల్టా ప్లస్ మరణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ వృద్ధురాలు(63) జులై 27న ఈ వేరియంట్‌ బారినపడి మరణించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమెకి గత నెల 21న కరోనా పాజిటివ్(Corona Positive) గా తేలింది. అప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో చికిత్స తీసుకుంటున్న క్రమంలో జులై 27న ఆమె చనిపోయారు. అయితే ఆమె టీకా(Covid Vaccine) రెండు డోసులు వేయించుకున్నారు. అంతేగాకుండా ఆమె ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవని అధికారులు వెల్లడించారు. ఇటీవల అందిన నివేదికల్లో మృతురాలితో సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యుల్లో డెల్టా ప్లస్ వేరియంట్(delta plus varient) వెలుగుచూసింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల వివరాలు తెలియాల్సి ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) అధికారులు స్పష్టం చేశారు.


Also Read: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు.. వ్యాక్సిన్ తప్పనిసరి


తాజాగా నమోదైన మరణంతో కలిపి మహారాష్ట్ర(Maharashtra)లో ఇప్పటివరకు మూడు డెల్టా ప్లస్ వేరియంట్ (delta plus varient) మరణాలు సంభవించాయి. రత్నగిరి(Ratnagiri)కి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు  కొద్ది రోజుల కిందట చనిపోయారు. ఆమె కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడిందని అప్పట్లో అధికారులు చెప్పారు. ఆమె మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి. ఇక రాయ్‌గఢ్‌లోనూ మరో మరణం సంభవించింది.. డెల్టాప్లస్ వేరియంట్‌ను కేంద్రం ఇప్పటికే ఆందోళనకర రకంగా గుర్తించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook