బీజేపీ నేత వినయ్ కతియార్ మరోసారి ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దేశాన్ని విభజించారు. కనుక వారు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలి అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ముస్లింలు ఈ దేశంలో నివసించరాదు. వారు మతం పేరుతో దేశాన్ని విభజించారు. అలాంటప్పుడు వాళ్లు ఈ దేశంలో నివసించడానికి అవసరం ఏముంది? వాళ్లు బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్‌కు వెళ్లాలి. వాళ్లకి ఇక్కడ పని ఏముంది?' అని  కతియార్ ఏఎన్ఐకి తెలిపారు.


'పాకిస్తానీ' అని పిలిచే వాళ్లని కఠినంగా శిక్షించే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసిన నేపథ్యంలో కతియార్ పైవిధంగా స్పందించారు.


పై వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. వందేమాతరం, జాతీయ జెండాను గౌరవించని వాళ్లను శిక్షించే విధంగా ఒక చట్టం ఉండాలని కతియార్ అన్నారు.


'వందేమాతరం, జాతీయ జెండాను అవమానించే వాళ్లని శిక్షించే విధంగా ఒక బిల్లు ఉండాలి. అలానే పాకిస్తాన్ జెండాను ఎగరవేసే వారిని శిక్షించాలి' అని కతియార్ ఏఎన్ఐకి తెలిపారు.