న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడడంతో కోర్టు ఆవరణలో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే ఈ దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. శనివారం ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసి, ఉరిశిక్షకు అన్ని ఏర్పుట్లు చేసి కూడా ఈ నాటకాలేమిటని ఆమె మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. ఒకడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ వేస్తే, మరొకడు నేను మైనర్‌నని కోర్టులో స్టే వేస్తాడు.


ఎన్నిరోజులు తాత్సారం చేసి ఈ మానవమృగాలను మేపుతారంటూ ఆశాదేవి కోర్టుపై మండిపడ్డారు. తమ కూతుర్ని దారుణాతిదారుణంగా అత్యాచారం చేసిన ఆ దోషులకు ఉరిశిక్ష పడేంతవరకు విశ్రమించబోమని ఆమె సవాలు చేశారు. ఏడెనిమిదేళ్లుగా తమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆమె విలపిస్తూ తన ఆందోళనను వెల్లడించారు. ఆ రాక్షసుల తరఫున వాదిస్తున్న లాయర్‌ ఏపి సింగ్‌, ప్రభుత్వం వారిని ఎన్ని రోజులు కాపాడతారో చూస్తామని ఆమె పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..