Omicron Cases in India: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి.. ఇప్పుడు ఇండియాలోనూ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు ఇప్పటి వరకు 200కు చేరుకున్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్‌లో 14, యూపీలో 2 కేసులు న‌మోద‌య్యాయి. 


అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ప‌శ్చిమ‌ బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్‌ కేసు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దాట‌డంతో కేంద్రం అప్ర‌మత్త‌మైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది.


డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్ఓ సూచనలతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్రం సూచించింది.  


Also Read: Corona Cases in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 5,326 కేసులు, 453 మరణాలు


Also Read: Free Tabs For Students: రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మొబైల్స్, ట్యాబ్స్ పంపిణీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి