అత్యాచారం కేసులో శిక్షపడ్డ  గుర్మీత్ బాబా పాపాల చిట్టా  తవ్వే కొద్ది బయటపడుతూనే ఉంది.  తనకు ఎదురు తిరిగిన వారిని హత్య చేసి ఇక్కడే పూడ్చి పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్మీత్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం  సిట్ ఏర్పాటు చేసింది.  విచారణ ముందుకెళ్తున్న కొద్ది డేరా బాబా అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుర్మిత్ బాబా ఆశ్రమ పరిసరాల్లో ఇప్పటి వరకు 600 అస్థి పంజరాలు వెలికితీసినట్లు విచారణ జరుపుతున్న ఓ అధికారి వెల్లడించారు.  కాగా డేరాకు వచ్చే గుర్మీత్ భక్తులు తాము మరణిస్తే.. మోక్షం కోసం ఈ ప్రాంతంలోనే ఖననం చేయాలని కోరుతుంటారని.. ఆ కారణంగానే వారిని ఇక్కడే సమాధి చేశామని కొందరు డేరా ప్రతినిధులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలు ఎవరివన్న కోణంలో అధికారుల విచారణ జరుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING