Oxygen Shortage: కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక రోగులు ప్రాణాలు పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే పరిస్థితి. ఆక్సిజన్ అందక ఏకంగా 20 మంది రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా కరోనా వైరస్ (Corona virus cases )మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్టు స్థాయిలో ఏకంగా 3.5 లక్షల కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతుంటే..మరోవైపు రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మృత్యుఘోష ఆగడం లేదు. తాజాగా ఇవాళ జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి( Jaipur Golden Hospital) లో కోవిడ్‌తో బాధపడుతున్న మరో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో అరగంటకే తమ వద్ద ఆక్సిజన్ నిల్వలున్నాయని గోల్డెన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ కొరతతో (Oxygen Shortage) 20 మంది రోగుల ప్రాణాలు పోయాయని..మరో 2 వందల మందికి పైగా రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇంకోవైపు ఆక్సిజన్ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్ ఆసుపత్రి ( Saroj Hospital) లో ఎవరినీ చేర్చుకోవడం లేదు. ఇప్పుడున్న రోగుల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు.


ఇక ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రి ( Batra Hospital) లో కూడా ఇదే పరిస్థితి. ఈ ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది. బాత్రా ఆసుపత్రి డిమాండ్‌కు తగ్గట్టు ఆక్సిజన్ సరఫరా ( Oxygen Supply) కావడం లేదు. 8 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరమైతే..కేవలం 5 వందల లీటర్ల ఆక్సిజన్ మాత్రం వస్తోంది. దాంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రస్తుతం బాత్రా ఆసుపత్రిలో 350 మంది రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌పైనే కోవిడ్ రోగుల చికిత్స ఆధారపడి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ అందకపోతే కరోనా రోగుల పరిస్థితి విషమంగా మారిపోతుందనేది వైద్యుల హెచ్చరిక. 


Also read: Corona Second Wave: దేశంలో ప్రమాదకర స్థాయిలో కరోనా ఉధృతి, 24 గంటల్లో 3.5 లక్షల కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook