శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ' హిందుస్తాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌ ' పాటను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి దీన్ని తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు  రాజాసింగ్‌  పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రాజాసింగ్ షేర్ చేసిన ఈ పాట ట్యూన్ తమదేనని..దీన్ని రాజాసింగ్‌ కాపీ కొట్టారని పాక్‌ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్తాన్‌ డే సందర్భంగా తాము రూపొందించిన 'పాకిస్తాన్‌ జిందాబాద్ '  పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాట ట్యూన్ ను కాపీ కొట్టినందుకు సంతోషమేనని..అయితే  కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు.