Kerala Assembly: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేరళలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో (Kerala) ఎల్డీఎఫ్ అనూహ్య విజయం సాధించింది.కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి పగ్గాలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రెండవసారి పట్టం కట్టారు ప్రజలు. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్  ప్రభుత్వ కేబినెట్ మరో రెండ్రోజుల్లో అంటే ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి బాథ్యతలు చేపట్టనున్నారు పినరయి విజయన్(Pinarayi Vijayan). 21 మందితో కేబినెట్ ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ తెలిపారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఎటువంటి ఆర్భాటాల్లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అన్నివర్గాల ప్రజలు తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఓట్లేసినందున..కేబినెట్‌లో సైతం అన్నివర్గాలవారికి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు.ఎల్డీఎఫ్ (LDF) కేబినెట్‌లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, ఎన్సీపీ తరపున ఒక్కొక్కరుంటారు. 


Also read: India Corona Deaths: భారత్‌లో కరోనా తగ్గుముఖం, తాజాగా 4,329 COVID-19 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook