Prayagraj: Four of Dalit family murdered; teenage girl gang raped over land dispute : భూవివాదం వల్ల ఓ ద‌ళిత కుటుంబానికి చెందిన న‌లుగురిని దారుణంగా హ‌త్య చేశారు. అలాగే ఆ ఇంటికి చెందిన మైనర్‌‌ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న యూపీలోని అల‌హాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భూవివాదం నేప‌ధ్యంలో ద‌ళిత కుటుంబానికి చెందిన 50 ఏళ్ల య‌జ‌మాని, 47 ఏళ్ల ఆయ‌న భార్యను, 17 ఏళ్ల కుమార్తెను, 10 ఏళ్ల కొడుకుని నిందితులు చంపేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Nikhil: ఇప్పటివరకూ 20 సార్లు ఆ పాట చూశాను.. ప్రతిసారీ ఏడ్చేశా: నిఖిల్‌


యూపీలో క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 11 మంది నిందితుల్లో 8 మందిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేశారు. గొడ్డ‌ళ్ల‌తో నిందితులు వారిని దారుణంగా హ‌త్య చేశార‌ని పోస్ట్‌మార్టం నివేదిక‌లో తేలింది.భూవివాదం నేప‌థ్యంలో అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన కుటుంబం గ‌తంలోనూ త‌మ‌ను ప‌రుష‌ప‌ద‌జాలంతో తిట్టి, వేధింపుల‌కు గురి చేసింద‌ంటూ బాధిత కుటుంబ‌స‌భ్యుల బంధువులు తెలిపారు. నిందితుల‌పై పలు కేసులు న‌మోదు చేశారు పోలీసులు. కేసు ద‌ర్యాప్తులో ఉంది.


Also Read : Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్ట‌ర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook