దక్షిణాదిలో పట్టు సాధించేందుకు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ రోజు తన సోదరి ప్రియాంకతో కలిసి వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 


రాహుల్ నామినేషన్ అనంతరం ప్రియాంకాగాంధీ భావోద్వేగ ట్వీట్ చేశారు. 'నా సోదరుడు రాహుల్ నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు అతను చాలా ధైర్యవంతుడు. వయనాడ్‌ ప్రజలారా.. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచడు అంటూ ప్రియాంక భావోద్వేగ ట్వీట్ చేశారు