జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు విధులు నిర్వహించడం కత్తిమీద సాములా మారింది. ఓవైపు దేశంలోకి చొరబడి అరాచకం సృష్టిస్తున్న ఉగ్రవాదులను ఏరివేస్తూనే మరోవైపు పలు సందర్భాల్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కునే పరిస్థితి అక్కడ నెలకొంది. తాజాగా ఆదివారం ఉదయం ముగిసిన షోఫియాన్ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా బలగాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఆందోళనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భద్రతా బలగాలపై ఉన్న కోపంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడి తమ ఆక్రోశాన్ని తీర్చుకున్న వైనం ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రచురించిన ఈ వీడియోలో చూడొచ్చు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షోఫియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నజీర్ అహ్మెద్ అనే ఓ ఆర్మీ సైనికుడు సైతం అమరుడయ్యారు.