Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి అల్పపీడనం..ఇవాళ ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ..ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపుకి వంపు తిరిగి ఉంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి. 


ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం అధికంగా ఉంది. ఈశాన్య మధ్య ప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది.


రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం వెళ్లనుందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ తెలిపాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంట పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీయనున్నాయి. ఇటు రాయలసీమలోనూ వానలు పడనున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 


Also read:Muslim Couple TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన ముస్లిం జంట!


Also read:AP ASSEMBLY LIVE UPDATES: కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే వెన్నుపోటుతో రిటర్న్ గిఫ్ట్.. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ త్వరగా చనిపోయారన్న జగన్    


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.