Secundrabad to goa journey bi weekly express train: తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది యువత తరచుగా గోవాకి టూర్ కి వెళ్తుంటారు. అక్కడి అందాలను, సముద్రం ను ఎంజాయ్ ను చేసేందుకు ప్లాన్ లు వేస్తుంటారు. అంతేకాకుండా.. అక్కడ లిక్కర్ కి కూడా యువత ఎక్కువగా ఫిదా అవుతుంటారు. కొందరైతే.. ఏమాత్రం బోర్ గా అన్పించిన కూడా వెంటనే గోవాలో వాలిపోతుంటారు. అక్కడ ఎంజాయ్ చేస్తు చిల్ అవుతుంటారు. ఈ క్రమంలో రైల్వే శాఖ గోవా లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


ఇది సికింద్రాబాద్ నుంచి బైవీక్లి వెళ్తుందని కూడా రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు బుధ, శుక్రవారం సికిందద్రాబాద్ నుంచి ప్రారంభమై, గురు, శనివారాల్లో వాస్కొడిగామా నుంచి బయల్దేరుతుంది. కాచీగూడ, షాద్ నగర్, జడ్చర్ల,మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్ లలో ఆగుతుందని తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.


ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీని పట్ల పాజిటివ్ గా స్పందించిన రైల్వే మంత్రి.. కొత్తగా ఈ రైల్వేను కేటాయించినట్లు వెల్లడించారు. గతంలోనే కిషన్ రెడ్డి పలుపర్యాయాలు ఈ విషయంను కేంద్ర పెద్దలకు చెప్పారు. కానీ అప్పట్లో.. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.


మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గారు గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు. 


దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.  ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదములు తెలిపారు.


Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..


ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. మరోవైపు గోవాకు బైవీక్లీ కేటాయించడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి