Omicron:  భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌  చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య(Omicron Cases in India) 21కి చేరింది. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్ లో 9 కేసులు వెలుగుచూశాయి. గతంలో కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Karnataka: కర్ణాటకలో 68 మంది విద్యార్థులకు పాజిటివ్‌


ఇటీవల దక్షిణాఫ్రికా(South Africa) నుంచి జైపూర్‌(Jaipur)కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్(Omicron) నిర్ధారణ అయ్యింది. వారితో పరిచయం ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్​గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం విశేషం. ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన వారిని ఆర్​యూహెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


నైజీరియా(Nigeria) నుంచి వచ్చిన మహారాష్ట్ర(Maharashtra)లోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ రకం వైరస్‌ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook