Thread Tied To Boy Private Part: ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8 ఏళ్ల విద్యార్థి ప్రైవేట్ భాగాన్ని పిల్లలు దారంతో కట్టేసిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడిని స్నానానికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ పనికి పాల్పడిన విద్యార్థులను బాలుడు గుర్తించలేకపోతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిద్వాయ్ నగర్‌లోని పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు కలిసి 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రైవేట్ పార్ట్‌ను నైలాన్ దారంతో బిగించారు. బాలుడు అలానే ఇంటికి రాగా.. తల్లిదండ్రులు స్నానం చేయించే సమయంలో గుర్తించారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి రాగా.. బాలుడిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచామని పోలీసులు తెలిపారు. 


అనంతరం ఈ చర్యకు పాల్పడిన విద్యార్థులను గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బాధిత విద్యార్థిని పాఠశాలకు తీసుకెళ్లారు. అయితే వారిని ఆ బాలుడు గుర్తించలేకపోయాడని పోలీసులు తెలిపారు. మరోసారి బాలుడిని పాఠశాలకు తీసుకువెళ్లి నిందితులైన విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు సౌత్ ఢిల్లీ పోలీసులు. 


బాలుడి తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాతే ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసు బృందం ఆస్పత్రికి చేరుకుని చిన్నారి తండ్రితో పాటు వైద్యుల నుంచి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. చిన్నారి పరిస్థితి సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు. అయితే కాసేపు వైద్యుల పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత.. పోలీసులు అతనిని తమతో పాటు పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.


Also Read: Interest Rate Hike: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ పథకాలకు వడ్డీ రేటు పెంపు   


Also Read: Bhairi Naresh: అయ్యప్పపై దారుణ కామెంట్స్.. వరంగల్‌లో భైరి నరేష్ అరెస్ట్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి