న్యూఢిల్లీ: హోలీ వేడుకలకు ముందే, చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించి, గృహిణులకు పెద్ద బహుమానమే ఇచ్చింది. ఈసారి తోమ్మిది సిలిండర్ల సబ్సిడీతో పాటు, రాయితీ సిలిండర్ల ధరలను తగ్గించింది. అంతేకాకుండా, వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల సిలిండర్ ధరలను కూడా తగ్గించాయి. తగ్గిన సిలిండర్ ధరలు మార్చి 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 47 ధర తగ్గింపు
ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని గృహా సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కు పడిపోయింది. కోలకతాలో సిలిండర్ల ధర రూ.45.50 తగ్గి రూ.711.50కు చేరుకుంది. ముంబయిలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గి  ప్రస్తుతం రూ. 699.50కు చేరుకుంది.



సబ్సిడీ సిలిండర్ల ధరలు కూడా  తగ్గాయ్..!


సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోల్కతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది.



వాణిజ్య సిలెండర్లు కూడా చౌక


19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు 77 నుంచి 80 రూపాయలకు తగ్గాయి. ఢిల్లీలో 78.50 రూపాయలు తగ్గి 1230 రూపాయలకు, కోల్కతాలో  77 రూపాయలు తగ్గి 1270.50 రూపాయలు, ముంబైలో రూ.79 తగ్గి రూ.1181కు , చెన్నైలో రూ.80 తగ్గి రూ.1307కు  చేరుకుంది.