Terror Attacks on Ram Temple: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడులకు టెర్రరిస్టులకు కుట్రపన్నుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందని ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్ తెలిపాయి. పాకిస్థాన్‌కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై రాబోయే రోజుల్లో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నుతోందనేది ఇంటెలీజెన్స్ వర్గాలకు అందిన సమాచారం. రామమందిరంపై ఉగ్రదాడి సమాచారం నేపథ్యంలో ఇంటెలీజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. రామ మందిరం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్‌కి అందిన సమాచారం ప్రకారం జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల్లో నిఘాను మరింత ముమ్మరం చేశారు. 



అయోధ్యలో భద్రతను దాటుకుని రామమందిరం పరిసరాల్లోకి ప్రవేశించడం అతి క్లిష్టమైన టాస్క్ అని భావించిన కారణంగానే... తమ ఉగ్రదాడి కుట్ర భగ్నం కాకుండా ఉండేందుకు ఆత్మాహుతి దాడిని మార్గంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ లక్ష్యాన్ని వైఫల్యం చెందకుండా కచ్చితంగా ఛేదించాలని భావించిన సమయంలోనే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి పద్ధతిని ఎంచుకుంటారు. గతంలో అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది.


ఇది కూడా చదవండి : MLAs With Oxygen Cylinders: ఆక్సీజన్ సిలిండర్లు తగిలించుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు


ఇది కూడా చదవండి : Kamal Haasan: 'ఆ రోజు నేను ఢిల్లీ వీధుల్లో ఉండేవాడిని'.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై కమల్ హాసన్ క్లారిటీ


ఇది కూడా చదవండి : Viral Video: ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలు.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook