న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ ఎంపి సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ పిటిషన్ తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.