Supreme Court on GST: సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆర్టికల్ 246A ప్రకారం పన్నులను సంబంధించిన చట్టాలను చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలుంటాయని స్పష్టం చేసింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే సమాఖ్య వ్యవస్థ కావడంతో వాటికి విలువ ఇవ్వాలని పేర్కొంది. ఈమేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కోర్టు కీలక తీర్పును వెలువరించింది. సముద్రంలో సరకు రవాణాపై 5  శాతం జీఎస్టీ విధిస్తూ 2017 కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను గుజరాత్ కోర్టు రద్దు చేసింది. ఓడలో సరకు రవాణాకు ఎలాంటి జీఎస్టీ విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఐతే దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలో కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.


జీఎస్టీ వసూళ్లపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్‌ అంటూ అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి . న్యాయ స్థానం తీర్పుతో జీఎస్టీ ట్యాక్సుల భారం తగ్గే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది.


 


Also read:Bank Recruitment: డిగ్రీ అర్హతపై కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరితేదీ!


Also read:KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook