సూరజ్ పాల్.. ఒక బీజేపీ నాయకుడు. ఆయనెవరో లోకల్ గా ఉన్న బీజీపీ నేతలకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ.. దేశం ఆయన్ను గుర్తుపెట్టుంది. ఎదో మంచి పని చేసినందుకు కాదండోయ్..!


సోషల్ మీడియాలో ఈ మధ్య ఏ సమాచారం అయినా త్వరగా చేరిపోతుంది. అలానే ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా. మొన్నీమధ్య ఈయన 'పద్మావతి' సినిమాపై వ్యాఖ్యలు చేశారు. సంజయ్ లీల భన్సాలీ, దీపికా పదుకొనె తలలు నరికితే రూ.10 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధినాయకత్వం  గుస్సా అయిందేమో ..కాబోలు వెంటనే  'హర్యానా బీజేపీ మీడియా చీఫ్ కో-ఆర్డినేట్ పదవి నుండి తప్పుకో' అంటూ షోకాజ్ నోటీసు జారీచేసింది. బీజేపీ అధినాయకత్వం, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీరుతో అసంతృపిగానే రిజైన్ చేసినట్లు ఆయన ఏఎన్ఐ మీడియాకు వివరణ ఇచ్చారు.