పాట్నా: బీహార్‌లోని శరన్ జిల్లా చాప్రాకు సమీపంలోని గౌతం ఆస్తాన్ వద్ద తపతి-గంగా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 10 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో నలుగురు గాయపడినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. రైలు పట్టాలు విరగడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.