సర్జికల్ స్ట్రయిక్స్ తో చావు దెబ్బకొట్టినప్పటికీ పాక్ కు బుద్ది వచ్చినట్లుగా లేదు. అలవాటు ప్రకారం మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది.భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పూంచ్, అఖ్నూర్, నౌషెరా సెక్టార్లలో కాల్పులు చేసిట్లు తెలిసింది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు.


పాక్ కుఠిల నీతి ముందే తెలిసిన భారత్ తన సైన్యాన్ని ముందుగానే మొహరించి ఉంచింది. ఫలితంగా పాక్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. భారత్ జరిగిన ఎదురుకాల్పులకు భయపడి పాక్ సైన్యం తొకముడిచి పారి పోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన 24 గంటల వ్యవధిలో పాక్  నాలుగు సార్లు కాల్పులు జరపడం గమనార్హం