Terrorists kill three BJP workers in Jammu and Kashmir: శ్రీ‌న‌గ‌ర్ : జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు బీజేపి కార్య‌క‌ర్త‌ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు ( Terror attacks ) జ‌రిపారు. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ( BJP workers ) మృతిచెందిన‌ట్లు కుల్గాం జిల్లా పోలీసులు స్పష్టంచేశారు. ఖాజీగుండ్ ప్రాంతంలో ఈ ఉగ్ర‌దాడి జ‌రిగిందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 8.20 గంటలకు వైకే పోరా గ్రామంలో ( YK Pora ) ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టుగా తమకు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఫిదా హుస్సేన్ అనే యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. Also read : Pulwama attack: పుల్వామా దాడిపై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతుల‌ను వైకే పోరా నివాసి అయిన బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిదా హుస్సేన్ యాటూ ( Fida Hussain Yatoo ), సోఫర్ దేవ్‌సర్ నివాసి అబ్దుల్ రషీద్ బేగ్ కుమారుడు ఉమర్ రషీద్ బేగ్ ( Umer Rashid Beigh ), వైకె పోరా నివాసి మొహద్ రంజాన్ కుమారుడు ఉమర్ రంజాన్ హజామ్‌గా ( Umer Ramzan Hajam ) పోలీసులు గుర్తించారు. 


బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం పోలీసులు, భద్రతా బలగాలు వైకె పొరా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు. Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe