Interim Budget 2024: ఫిబ్రవరి 1 ఇవాళ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్ మాత్రమే ఉంటుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం జరగనుంది. ఎన్నికల తాయిలాలతో పాటు సామాన్య ప్రజలకు ఊరట కల్గించే విధంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 9 గంటలకు ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. ఉన్నతాధికారులతో కలిసి 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. బడ్జెట్‌పై ఆమె అనుమతి తీసుకుని 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. బడ్జెట్ సమర్పించడానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మంత్రివర్గ భేటీలో బడ్జెట్‌పై ఆమోదం తీసుకునే ప్రక్రియ ఉంటుంది. అనంతరం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. 


ఈసారి బడ్జెట్‌లో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, సూర్యోదయ యోజన పథకాల లబ్దిదారులకు మరింత ప్రయోజనం కల్గించే నిర్ణయాలుండవచ్చు. పన్నులు, చమురు ధరలు, గ్యాస్ ధరలు తగ్గే అవకాశముంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి అందిస్తున్న 6 వేల రూపాయలను 9 వేలు చేయవచ్చని అంచనా. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల భీమా కవరేజ్ అందుతోంది. దీనికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చేయవచ్చు. 


ఆదాయవర్గాలైతే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80 డి ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య ఖర్చులు, హెల్త్ క్లెయిమ్ పరిమితి పెంచవచ్చని ఆశిస్తున్నారు. సేవింగ్ స్కీమ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులకు పన్ను మినహాయింపు ఉండవచ్చు. 


Also read: 8th Pay Commission: బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్..? ఆ ప్రకటన వస్తే పండగే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook