హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎట్టకేలకు UPSC-2020 సవరించిన తేదీలను ఈ రోజు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో పోందుపర్చింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, UPSC (ప్రిలిమినరీ) పరీక్ష 2020, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2020 సంబంధించి అక్టోబర్ 4 న నిర్వహించబడతాయని వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: పోటీ పరీక్షల Revised షెడ్యూల్ తేదీలను విడుదల చేసిన SSC..


యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జనవరి 8, 2021న ప్రారంభమవుతాయని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు UPSC అధికారిక వెబ్ సైట్ లో పోందుపర్చింది. మెయిన్స్ కు సంబంధించి సవరించిన పరీక్ష తేదీలను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో పూర్తి సమాచారం అందుబాటులో ఉందని పేర్కొంది. 


Also Read: TS SSC exams 2020: 10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్


కాగా UPSC 2020 పరీక్ష మే 31న జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. UPSC విడుదల చేసిన తాజా పత్రికా ప్రకటన ప్రకారం, కమిషన్ 2020 మే 20న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జూన్ 5న పరీక్షల షెడ్యూల్ తేదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..