UP Road accident - 14 persons died: లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. యూపీ ప్రయాగ్‌రాజ్ మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి (Manikpur police) లోని ప్రతాప్‌గడ్‌లో ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారి ( Prayagraj-Lucknow highway ) పై గురువారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. కుండా నుంచి ప్రయాగ్‌రాజ్‌ వైపు వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. భారీ శబ్దంతో స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారమిచ్చారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రమాద తీవ్రతను చూసి ఎవరూ కూడా మృతదేహాల్ని వెలికితీసేందుకు ముందుకు రాలేదని స్థానికులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొంటున్నారు. Also read: Sasikala: త్వరలోనే చిన్నమ్మ విడుదల.. రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు


ప్రతాప్‌గఢ్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి వెంటనే చేరుకుని బాధితులకు సాధ్యమైనంతమేరకు సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి