Vikas Dubey's encounter: కాన్పూర్: వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అతడి భార్య రిచా దూబే స్పందిస్తూ.. తన భర్త తప్పు చేశాడని.. అందుకే ఈ గతి పట్టిందని వ్యాఖ్యానించింది. అయితే, అదే సమయంలో తన భర్త ఎన్‌కౌంటర్‌లో హతమవడానికి కారణం మీడియానే అంటూ ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేసింది. శుక్రవారం సాయంత్రం వికాస్ దూబే అంత్యక్రియలకు హాజరైన రిచా దూబేను ( Vikas Dubey's wife Richa Dubey ) మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా మీడియాపై మండిపడిన ఆమె.. మీడియా సిబ్బందిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా అసహనం వ్యక్తంచేశారు. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )


గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అంత్యక్రియలను ( Vikas Dubey's cremation ) అతడి భార్య, కొడుకు సమక్షంలో బావమరిది దినేష్ తివారి జరిపించారు. కాన్పూర్‌లోని ఎలక్ట్రానిక్ క్రిమేటొరియంలో వికాస్ దూబే అంత్యక్రియలు ముగిశాయి. వికాస్ దూబే అంత్యక్రియల సందర్భంగా కాన్పూర్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికాస్ దూబే అనుచరులు రావొచ్చనే అనుమానాల నేపథ్యంలో స్మశానవాటిక పరిసరాలపై పోలీసులు నిఘా వేశారు. కాన్పూర్ ఈస్ట్ సిటీ ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. ( Also read: Telangana: కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్ అప్‌డేట్స్ )