ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు ఏడు రాష్టాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్‌లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో అల్లర్లు, ఘర్షణలు, ఈవీఎంల మొరాయింపు కారణంగా కొన్ని చోట్ల తాత్కాలికంగా ఓటింగ్ నిలిచిపోయినప్పటికీ... మిగతా ప్రాంతాల్లో పోలింగ్ సజావుగానే సాగుతోంది. 


మధ్యాహ్నం 3 గంటల సమయానికి నమోదైన పోలింగ్ శాతం ఇలా వుంది. 
బీహార్-46.66%, 
హిమాచల్ ప్రదేశ్- 49.43%, 
మధ్యప్రదేశ్-57.27%, 
పంజాబ్-48.18%, 
ఉత్తర్ ప్రదేశ్-46.07%, 
పశ్చిమ బెంగాల్- 63.58%, 
జార్ఖండ్-64.81%, 
చండీఘడ్-50.24%