తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికేందుకు రాజాజీ హాల్ వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్న అభిమానులు. రాజాజీ హాల్ వద్ద ఉన్న పరిస్థితిని ఈ ఏరియల్ వ్యూ దృశ్యంలో వీక్షించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 



 


రాజాజీ హాల్ వద్ద కరుణానిధి పార్థివదేహాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రాజాజీ హాల్ వద్ద గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీ జన సందోహాన్ని నిలువరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.