దీపావళి నేపథ్యంలో బంగారం ధర మరోసారి భగ్గుమంటోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.290 పెరిగి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. దీపావళి సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి బంగారానికి డిమాండ్‌ పెరగడంతో 10 గ్రాములు రూ.31 వేలjకు చేరింది. మరోపక్క వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది.