DA Hike: మీ జీతంలో పెరుగుదల ఏంటో తెలుసా? 24 గంటల్లోనే ప్రకటన!

Wed, 09 Oct 2024-10:37 am,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఒక మంచి శుభ వార్తల వినే సమయం ఆసన్నం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దాంతో మోదీ ప్రభుత్వంలోని ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.   

తాజా సమాచారం ప్రకారం, డీఏ (డియర్ నెస్ అల్లోవన్స్) 4 శాతం పెరగనుందని తెలుస్తోంది. 2024 మార్చిలో.. కేంద్రం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ-డీఆర్ 4 శాతం పెంపు చేసింది ప్రభుత్వం. ప్రతి ఆరు నెలలకు డీఏ పెంపు జరుగుతుంది. ఒకటి జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది, మరొకటి జూలై 1 నుండి అమలవుతుంది. 

రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయాల్లో, మార్కెట్ ధరల ఒత్తిడి కారణంగా డీఏ పెంపు జరగనుంది. ఉద్యోగుల డీఏ, రిటైర్డ్ ఉద్యోగుల డీఆర్ జీవనాధారంలో అత్యంత ముఖ్యమైన భాగమైన AICPI (ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) సగటు మొత్తం ఆధారంగా నిర్ణయించబడుతుంది.   

దీని ప్రకారం, డీఏ 3 శాతం పెరిగినట్లయితే.. ఒక ఉద్యోగి యొక్క కనీస ప్రాథమిక జీతం రూ. 18,000 గా ఉంటే, అది రూ. 9,000 నుండి రూ. 9,540 కు పెరుగుతుంది. అదే, డీఏ పెంపు 4 శాతం అయినట్లయితే, ఆ జీతం రూ. 9,720 వరకు చేరుతుంది.

వచ్చే అక్టోబరులో, కేంద్రం నుండి డీఏ పెంపు ప్రకటన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు పండుగ సీజన్‌లో పెద్ద బొనాంజాలా మారవచ్చు. దీంతో, వచ్చే 48 గంటల్లోనే కేంద్ర ఉద్యోగులు డీఏ పెరుగుతుందనే ఆశలు పెట్టుకున్నారు. 

అంతేకాకుండా, 8వ వేతన కమిషన్ (8th Pay Commission) చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగా, డీఏ మరియు డీఆర్ పెంపు మరింత పెరగవచ్చు. దుర్గాపూజ వేళకి.. అంటే బుధవారం నాటికి, కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు పెద్ద వార్తగా మారే అవకాశముంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link