7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

Tue, 20 Apr 2021-4:42 pm,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 లక్షల మంది, పెన్షనర్లు 65 లక్షల మంది గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వీరికి శుభవార్త అందింది. జూలై నెల నుంచి వీరికి డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం నుంచి 28 శాతానికి పెరగనుంది. జూలై నెల వేతనాలలో సవరించిన డీఏ మరియు డీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు అందుకోనున్నారు.

Also Read: 7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(AICPI) విడుదల చేసిన సమాచారం ప్రకారం జనవరి 2021 నుంచి జూన్ నెల కాల వ్యవధికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. జనవరి 2020 నుంచి నేటివరకూ ఉద్యోగులకు డీఏ సంవరించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల డీఏ, డీఆర్ ఇతర అలవెన్సులు సవరించలేదు. వీరికి మొత్తం దఫాల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించడంలో భాగంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను 17 శాతం నుంచి 28 శాతం వరకు పెంచనున్నారు. 

జనవరి 1, 2020 నుండి జూన్ 2020 వరకు 3 శాతం డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సి ఉంది. జూలై 1, 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం జనవరి 1, 2021 నుండి జూన్ 2021 కాలానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ రావాల్సి ఉంది. ఈ మూడు పెండింగ్ డీఏలు 3+4+4 మొత్తం 11 శాతం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వారికి 17 శాతం డీఏ వస్తుంది. తాజాగా ఈ మూడు పెండింగ్ డీఏలు కలిపితే వచ్చే మొత్తం 28 శాతం డీఏను జూలై వేతనంలో సవరించి కొత్త జీతాలు అందించనున్నారు.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ సమ్మన్ నిధి రూ.2000 త్వరలో జమ

ఏడవ వేతన సంఘం ప్రతిపాదన ప్రకారం చూస్తే ఉద్యోగులకు 2.57 ఫిట్‌మెంట్ లభిస్తుంది. దీని ఆధారంగా జీతాలు ఎలా పెరగనున్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓ ఉద్యోగికి బేసిక్ శాలరీ రూ.20,000 అనుకుంటే ఏడవ వేతన సంఘం సిఫార్సు ప్రకారం నూతన వేతనం 20,000x2.57 = రూ.51,400 అవుతుంది. దాదాపు కొత్త వేతనం ఇలా అందుకోనున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులు కొంతకాలం వరకు పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయితే పరిస్థితులు సర్దుబాటు అయిన తరువాత సవరించిన డియర్‌నెస్ అలవెన్స్‌తో కలిపి కొత్త వేతనాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ దీనిపై స్పందించారు. జులై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link