DA Hike Latest News: 7వ వేతన సంఘం సిఫార్సు, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

Thu, 25 Feb 2021-10:54 am,

డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచాలని, పెండింగ్ బకాయిలు 4 శాతం సైతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, 2021 జనవరి నుంచి జూన్ వరకు కొత్త డీఏ 25 శాతం కానుంది.

జూలై 2020 నుండి డిసెంబర్ వరకు అదనంగా 4 శాతం డీఏ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతంలో చేరలేదు. అదనపు డీఏ కోసం వారు ఎదురుచూస్తున్నారు.

7వ వేతరణ సంఘం సూచనల తరువాత కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఇతర బెనిఫిట్స్ సైతం గణనీయంగా పెరుగనున్నాయి.

7వ వేతన సంఘం(7th Pay Commission) నిబంధనల ప్రకారం, డీఏ పెంపు ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ట్రావెల్ అలవెన్స్ (టీఏ) కచ్చితంగా పెరుగుతంది. డీఏ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతం పెరుగుతుంది.

సుమారు 58 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు డీఏ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief), డీఏతో నేరుగా అనుసంధానమై ఉంటుంది.

7 వ వేతన సంఘం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా డీఏ బకాయిలు లభిస్తాయి. ఫిబ్రవరిలో DA ప్రకటించినట్లయితే, ఉద్యోగులకు జనవరి 2021 నెల బకాయిలు తరువాతి నెలలో అందుతాయి. ఎందుకంటే డీఏ అంటే జనవరి నుంచి జూన్ 2021 వరకు వర్తిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link