7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..!

Tue, 06 Aug 2024-6:34 pm,

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు జీతాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ పెంపు జనవరిలో, రెండో డీఏ పెంపు జూలైలో ఉంటుంది. జనవరి డీఏ 4 శాతం పెంచగా.. జూల్ డీఏ 3 శాతం పెంచే అవకాశం ఉంది.  

ఈ నెల లేదా సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు.  

జనవరి డీఏ 4 శాతం పెంచడంతో డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 53 శాతానికి చేరుతుంది.  

డీఏ 3 శాతం పెరిగితే.. ఉద్యోగి డియర్‌నెస్ అలవెన్స్ రూ.1,00,170 వరకు పొందవచ్చు. ఈ పెంపు గ్రేడ్ పే, జీతం ఆధారంగా మారుతుంది.  

గ్రేడ్ పే రూ.1800 నుంచి రూ.2800 స్థాయి 1 నుంచి 5 వరకు, పే బ్యాండ్ 1 (రూ.5200 నుండి రూ.20200)లో ఒక ఉద్యోగి జీతం రూ.31,500 అయితే.. డీఏ 53 శాతం కలిపితే మొత్తం జీతం రూ.1,00,170 అవుతుంది. ప్రస్తుతం వీరిలో 50 శాతం మంది ఉద్యోగులు 6 నెలల ప్రాతిపదికన రూ.94,500 పొందుతున్నారు.   

ఉద్యోగి బేసిక్ పే-రూ.31,500; ప్రస్తుత తగ్గింపు రేటు (50 శాతం)-రూ. 15,750/నెలకు; 6 నెలలు తగ్గింపు రేటు (50 శాతం)-రూ.94,500; కొత్త తగ్గింపు రేటు (53 శాతం)-రూ 16695/నెలకు; 6 నెలలకు తగ్గింపు రేటు (53 శాతం) 16695X6= రూ.1,00,170.  

గత నాలుగు పర్యాయాలు కూడా డీఏ 4 శాతం పెరిగింది. అయితే ఈసారి 3 శాతం పెరిగి అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.          

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link