8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో అదిరిపోయే పెంపు.. ప్రకటన ఎప్పుడంటే..?

Thu, 04 Jul 2024-3:52 pm,

త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు ప్రకటన రానుంది. ప్రస్తుతం డీఏ 50 శాతం ఉండగా.. నాలుగు శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రానికి వరుసగా వినతులు వెళుతున్నాయి. నిబంధనల ప్రకారం పదేళ్ల తరువాత కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి 8వ వేతన సంఘంపై ట్వీట్ చేశారు. "7వ వేతన సంఘం 25 సెప్టెంబర్ 2013న ఆమోదించారు.  జస్టిస్ AK మాథుర్ ఆధ్వర్యంలో 4 ఫిబ్రవరి 2014న ఏర్పాటైంది. నేను ఆర్థిక శాఖ మంత్రిని అభ్యర్థించి 10 ఏళ్లు దాటింది. నిర్మలా సీతారామన్ గారు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ జీతాలు అందుతాయి. ఉద్యోగులు ద్రవ్యోల్బణంతో వేగాన్ని కొనసాగించగలరు.." అని ఆయన కోరారు.  

కొత్త కమిషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. కోటి 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.  

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. 2025-26లో జీతం 44.44 శాతం పెరిగి కనీస వేతనం 26 వేల రూపాయలు అవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతం పెరుగుతుంది. కొత్త పే కమిషన్ నిబంధనలు 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.   

బడ్జెట్ సమావేశాల తరువాత కొత్త పే కమిషన్ ఏర్పాటుపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link