Pooja Hegde: ఆ హీరోతో ప్రేమ వల్లే పూజా హెగ్డే అన్నిటికి దూరమైందా..?

Mon, 07 Oct 2024-12:22 pm,

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే. నాగచైతన్య ఒక లైలా కోసం సినిమా ద్వారా పరిచయమైన ఈ హీరోయిన్.. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది. ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ ముకుందా సినిమాలో కనిపించింది. 

తన కెరియర్ మొదట్లోనే ఏకంగా హృతిక్ రోషన్తో ఛాన్స్ కూడా కొట్టేసింది. హిందీలో మోహన్ జాదారో సినిమాలో నటించింది. అయితే ఇవేవీ కూడా ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. 

ఇక కెరియర్ మొదట్లోనే రంగస్థలం లాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ లో సైతం నటించింది. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ దశ మారిపోయింది. ఆ తరువాత పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్ని వరుసగా విజయాలు సాధించడం మొదలుపెట్టాయి. 

అరవింద సమేత, అలా వైకుంఠపురం లో లాంటి సూపర్ హిట్ సినిమాలలో సైతం కనిపించింది. ఇక పూజ హెగ్డే కి తిరుగులేదు అనుకున్న సమయంలో వరస పరాజయాలు రావడం మొదలుపెట్టాయి. చిరంజీవి, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య దిజాస్టర్ చవిచూసిందే.

ఆ తర్వాత వచ్చిన రాదే శ్యామ్,  బీస్ట్ సినిమాలు కూడా ఈ హీరోయిన్ కి ఫ్లాప్ ని మిగిల్చాయి. ఇక ఆ తరువాత పెద్దగా సౌత్ సినిమాలలో కనిపించలేదు. అయితే అప్పుడు అందరూ వరస ఫ్లాపుల వల్ల ఈ హీరోయిన్ కి అవకాశాలు రాలేదు అనుకున్నారు. అయితే అసలు కారణం అది కాదంట. కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్ తో నటించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అన్న వార్తలు వినిపించాయి. సాధారణంగా సల్మాన్ ఖాన్ తను ప్రేమించిన అమ్మాయిలకి కొన్ని నియమాలు పెడుతారు అనే టాక్ ఉంది. అయితే అప్పట్లో పూజా హెగ్డే కూడా.. ఇలానే ఒక కండిషన్ పెట్టారంట.. తాను ఎక్కువగా సినిమాలు ఒప్పుకోకూడదని. అప్పట్లో పూజా హెగ్డే తనకొచ్చిన తెలుగు సినిమాలు అన్ని వద్దు అనిందని.. అందుకే ఇప్పుడు ఛాన్సల్ లేకుండా పోయాయని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో నిజమెంటో తెలియాలి అంటే పూజా హెగ్డే చెప్పాల్సిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link