Air India Offers: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి భారీ ఆఫర్, 1000 రూపాయలకే ఫ్లైట్ టికెట్ లిమిటెడ్ ఆఫర్

Sun, 25 Aug 2024-7:44 am,

ఎయిర్ ఇండియా గ్రేట్ సేల్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇప్పుడు దేశంలోని 32 నగరాలకు కేవలం 1037 రూపాయలకే ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో రెండు రకాల టికెట్లు ఉంటాయి. Express Lite టికెట్ ధర 1037 రూపాయలుంటే Express Value టికెట్ ధర 1195 రూపాయలతో మొదలవుతుంది.

ఈ ఆఫర్ పొందాలంటే ఇవాళే చివరి తేదీ. అంటే ఆగస్టు 25 రాత్రి వరకూ మీకు అవకాశం ఉంది. ఈ ఆఫర్‌లో అక్టోబర్ 24 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఎప్పుడు ప్రయాణించేది ఇవాళ్టిలోగా బుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

ఢిల్లీ-జైపూర్, కోల్‌కతా-ఇంఫాల్, చెన్నై-భువనేశ్వర్ వంటి 32 డెస్టినేషన్లకు ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. Express Biz టికెట్ ధరలు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737-8 ఎయిర్ క్రాఫ్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 సీనియర్ సిటిజన్లు, స్మాల్ బిజినెస్ మెన్, డాక్టర్లు, నర్శులు, మిలిటరీ సిబ్బంది కూడా డిస్కౌంట్ టికెట్ పొందవచ్చు. బిజినెస్ , ప్రైమ్ సీట్లపై 47 శాతం వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా 8 శాతం వరకు న్యూ కాయిన్స్ పొందవచ్చు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లైట్ ప్రకారం చెక్ ఇన్ బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. 3 కేజీల వరకూ అదనపు కేబిన్ బ్యాగ్ ఉచితం కానీ ముందుగా బుక్ చేసుకోవాలి. 15 కిలోల చెకిన్ బ్యాగ్స్‌పై డిస్కౌంట్ ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link