Sobhita Dhulipala: నాకు పిల్లల్ని కనే ఆలోచన లేదు.. బాంబు పేల్చిన శోభితా ధూళిపాళ.?.. టెన్షన్ లో అక్కినేని ఫ్యాన్స్..

Thu, 26 Sep 2024-6:44 pm,

అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్ మెంట్  ఆగస్టు 9 న గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకను కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య చేసినట్లు తెలుస్తోంది. ఎంగెజ్ మెంట్ తర్వాత అక్కినేని నాగచైతన్య.. ఇన్ స్టా వేదికగా తన ఫోటోలను షేర్ చేశారు. అంతే కాకుండా.. ఎప్పటికి హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించారు. మరోవైపు అక్కినేని అభిమానులు సైతం బెస్ట్ విషేస్ చెప్పారు.  

ఇదిలా ఉండగా...శోభితా.. 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ విజేతగా నిలిచారు. అంతేకాకుండా.. రామన్ రాఘవన్ , మెడ్ ఇన్న హెవెన్, దినైట్, మేజర్ వంటి మూవీస్ లలో నటించారు. అంతే కాకుండా.. బాలీవుడ్ మూవీలో గూఢచారి లో వేశ్య పాత్రలో సైతం నటించారు.  

చైతు,  శోభితాల ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి తరచుగా ఏదో ఒక రూమర్స్ తో శోభితా రెగ్యులర్ గా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత కొంత మంది ఆమెను ఎంగెజ్మెంట్ చేసుకున్న వేళ చెడు జరిగిందని కూడా రూమర్స్ వ్యాప్తి చేశారు.  

సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకడుగు ముందుకేసి.. చైతు, శోభితలకు కూడా డైవర్స్ అవుతుందని కూడా చెప్పి మరో బాంబు సైతం పేల్చాడు. ఈ క్రమంలో..  ప్రస్తుతం.. శోభితా ధూళి పాళ తరచుగా ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు.  

తాజాగా, శోభితా ధూళి పాళ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనిలో ఆమె తన ఎంగెజ్ మెంట్ గురించి మాట్లాడారు. తన లైఫ్ లో ఎంగెజ్ మెంట్ ఇలా గ్రాండ్ గా జరగాలి.. అలా పెళ్లి,  ఇలా పిల్లల గురించి ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చింది. కానీ తన ఎంగెజ్ మెంట్ మాత్రం బాగా జరిగిందని చెప్పింది.

అంతే కాకుండా.. ఏది జరిగిన అది సంప్రదాయ బద్దంగా జరగాలని మాత్రం కోరుకున్నట్లు చెప్పింది.  అయితే.. అయితే శోభితా పెళ్లి విషయంలో.. ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని గానీ.. పిల్లలను కనాలని గానీ అనుకోలేదని మాత్రం చెప్పినట్లు సమాచారం.

అంటే లైఫ్ లో కొన్ని విషయాలు ఎప్పుడు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. కళ్యాణం వచ్చిన, కక్కొచ్చిన కూడా ఆగదని అంటారు. అలానే.. ఇప్పుడు కళ్యాణం ఘడియలు వచ్చాయి.. అందుకు ఇలా వెంటనే ఎంగెజ్ మెంట్ జరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది.  

అయితే.. దీన్ని కొంత మంది నెటిజన్ లు దీన్ని కావాలనే.. కాంట్రవర్సీ వైపుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కావాలనే.. ఆమె ఎప్పటికి పిల్లలను కనాలనుకోలేదు అన్నట్లుగా బురిడి కొట్టించే విధంగా లేనిదీ క్రియేట్ చేస్తూ ఆ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు.. దీంతో కొంత మంది అభిమానులు ఇదే నిజం కాబోలు అని ఇదేక్కడి రచ్చరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారంట. మొత్తానికి ఈ రూమర్స్ మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link