Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..

Sun, 02 Jun 2024-1:38 pm,

అమీషా పటేల్ హిందీలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘కహోనా ప్యాన్ హై’ మూవీతో కథానాయికగా పరిచయమైన అప్పట్లోనే గ్లామర్ డాల్ గా సత్తా చాటింది. తెలుగులో అమీషా పటేల్.. పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత మహేష్ బాబుతో ‘నాని’ సినిమాలో యాక్ట్ చేసింది. అటు ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’, నందమూరి బాలకృష్ణతో ‘పరమవీరచక్ర’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఈ సినిమాలేవి తెలుగులో సక్సెస్ కాలేదు. దీంతో ఈ భామ టాలీవుడ్ కు బై బై చెప్పేసింది.

బాలీవుడ్లో ‘కహో నా ప్యార్ హై’ తర్వాత సన్ని దేవోల్ హీరోగా అనిల్ శర్శ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గదర్’ మూవీలో నటించింది. ఈ సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా విడుదలైన 23 యేళ్లకు ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘గదర్ 2’ మూవీ చేసింది. ఈ  సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కు పట్టిన దుమ్ము దులిపి అసలు సిసలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

 

ప్రస్తుతం చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ లతో హీట్ పుట్టించడం అమీషా పటేల్ స్టైల్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link