Wallet: వీటిని పొరపాటున కూడా మీ మనీ పర్సులో పెట్టుకోకండి.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Fri, 23 Feb 2024-8:23 pm,

ఎంతో కష్టపడితే కానీ ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. గంటల తరబడి ఆఫీసు పనులు చేస్తూ చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు. ఇప్పుడున్న ధరలకు ఎంత సంపాదించిన కూడా నెలప్రారంభంకాగానే ఖర్చైపోతుంటాయి..

అయితే.. డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడం వెనుక కొన్నికారణాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కొందరు తమ జేబులలో చిరిగిపోయిన కరెన్సీ నోట్లు , ఆస్పత్రి బిల్స్ లను అవసరం లేకున్న కూడా పెట్టుకుంటారు.

ఇది ఎంతో నెగెటివ్ ఫలితాలను ఇస్తుంది. మరికొందరు చిరిగిపోయిన కాగితాలు, పాత పేపర్లు ఏళ్ల తరబడి తమ జేబుల్లోనే పడేయకుండా పెట్టుకుంటారు. దీని వల్ల కూడా సంపాదించిన డబ్బులు నిలువకుండా ఖర్చు అయిపోతుంటాయి. 

జ్యోతిష్యుల ప్రకారం.. పర్సులో కేవలం మనం రెగ్యులర్ గా ఉపయోగించే ఏటీఎంలు, డెబిట్ కార్డులను పెట్టుకొవాలి. అంతే కానీ.. అనవసరమైన వాటిని అస్సలు పెట్టుకొవద్దు. ఉపయోగంలేని చిన్నపేపర్ ముక్కకూడా పెట్టుకొవద్దు..  

డబ్బుల పర్సును బాత్రూమ్ లలోకి తీసుకెళ్లకూడదు. కొందరు బాత్రూమ్ లలో వాష్ బేసిన్ మీద పెడుతుంటారు. ఇలాంటి పనులు వల్ల డబ్బులు అస్సలు ఉండవు. జేబుకు చిల్లు పడ్డట్లు ఖర్చు అవుతాయి.  

మనం కష్ట పడి సంపాదించిన డబ్బులు నిలవాలంటే, కొందరు జ్యోతిష్యులు లవంగం, విలాయిచీలు పెట్టుకొవాలని చెబుతుంటారు. ఇలా పెట్టుకుంటే అనవసరంగా డబ్బులు ఖర్చుకాకుండా ఉంటాయని చెబుతారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link