Rammandir Pics: అయోధ్య రామమందిరం లోపలి ఫోటోలు చూశారా, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్

Sun, 29 Oct 2023-5:13 pm,

రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నాడు 4 వేల మంది సాధువులు, విభిన్న సమాజాలకు చెందిన 2000 మంది పాల్గొంటారు.

అయోధ్యలో మందిర నిర్మాణం రెండవ దశ 2024 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. మూడవ ధస 2025 డిసెంబర్ నాటికి పూర్తి కానుంది.య ఈ దశలో అంటే మూడవ దశ పూర్తయ్యే సరికి మంందిరం పరిసరాలు పూర్తిగా నిర్మాణమౌతాయి. 

అయోధ్యలో రామ మందిర నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రారంభమైంది. మూడు దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. మొదటి దశ 2023 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. మొదటి దసలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది.

ఆలయం లోపల కళాత్మక ఆర్ట్ ఉంది. అయోధ్యలో జనవరి 22, 2024న భారీగా భక్తజనం తరలిరావచ్చని అంచనా. ఈ క్రమంలో భద్రత ఇతర ఏర్పాట్లపై ట్రస్ట్ ఆందోళన చెందుతోంది. 

శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ ప్రకారం రామ మందిర నిర్మాణం పూర్తయ్యాక ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంచనా. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనానికి ప్రతి ఒక్కరికి 20-30 సెకన్లు మాత్రమే సమయం కేటాయించనున్నారు.

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం పదిరోజులు నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. 

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరం లోపలి ఫోటోల్ని శ్రీ రామ జన్మభూమి తీర్ఘక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఇందులోరామాలయం లోపలి ఆర్కిటెక్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది. జనవరి 22, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link