Bharat Bandh: తెలంగాణలో కొనసాగుతున్న భారత్ బంద్
దీంతోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో కూడా బంద్ కొనసాగుతోంది. రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ బూర్గుల గేట్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( K Kavitha ) కూడా బంద్లో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న నిరసనల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలు పార్టీల నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కూడా బంద్ కొనసాగుతోంది.
బంద్ కారణంగా తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.