Tirumala: తిరుపతి వెళ్తున్నారా? ఈ 10 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు.. ఎప్పుడో ముందుగానే తెలుసుకోండి..

Tue, 01 Oct 2024-2:33 pm,

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఎంతో మంది ఆరాటపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దసరా సెలవులు వచ్చాయని మీరు కూడా తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకు ఇది బిగ్‌ అలెర్ట్‌..  

స్కూళ్లకు సెలవులు వచ్చేశాయి. అధికారికంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రకటన చేశాయి. అయితే, ఈ సెలవుల్లో తిరుపతి వంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. ప్లాన్‌ చేసి వెళ్తారు. మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయం ముందుగానే తెలుసుకోండి.  

తిరుమలలో తిరుమంజాసనం వంటివి నిర్వహించారు. మొన్నటి వరకు అంగప్రదక్షిణ, లక్కీ డిప్‌ ద్వారా తిరుమల దర్శనం టిక్కెట్‌లను విడుదల చేశారు.  

లక్కీడిప్‌ ల ద్వారా టిక్కెట్లు పొందే వారు ఆధార్‌ కార్డు ద్వారా అంగప్రదక్షిణ టిక్కెట్‌ను పొందుతారు. ఇదిలా ఉండగా అంతకు ముందు 24 వ తేదీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు డిసెంబర్‌కు సంబంధించినవి కూడా టీటీడీ విడుదల చేసింది.  

అయితే, ఇదిలా ఉండగా ఈ నెల అక్టోబర్‌ 3 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పది రోజులపాటు ప్రత్యేక దర్శనం దేవస్థానం రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు నిలిపి వేయనున్నారు.  

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఏడాదిలోపు పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.  

ఇక తిరుమల శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోడానికి వస్తారు. ఈ నేపథ్యంలో బ్రేక్‌ దర్శనాలు, పలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link