Pension In Telangana: తెలంగాణ పెన్షనర్లకు మంత్రి సీతక్క కీలక అప్డేట్.. ప్రతినెల వారికి రూ.6 వేలు ఎప్పటినుంచంటే..?

Tue, 09 Jul 2024-1:35 pm,

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని మొట్టమొదట ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది.   

అయితే, ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పింఛను దారులకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏ అప్డేట్‌ రాలేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మాత్రమే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. పింఛను దారులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ విషయంపై కీలక అప్డేట్‌ ఇచ్చారు. తాజాగా అభయహస్తంలో భాగంగా అప్లై చేసుకున్న కొత్త పింఛనుదారుల్లో అర్హులైనవారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పథకాన్ని చేయూత స్కీమ్‌ ద్వారా అందించనున్నారు.  

అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందిస్తామని, కానీ, ఎప్పటి నుంచి అనేది ఇప్పటికీ స్పష్టమైన తేదీ చెప్పలేను కానీ, త్వరలోనే అర్హులైన వారికి పెరిగిన పెన్షన్‌ అందుతుందని దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిసారిస్తోందని చెప్పారు.  

ఇప్పటికే మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు కాగానే మొదటి నెలలోనే ఎరియర్స్‌తో రూ. 7 వేలు పింఛనుదారుల ఖాతాలో జమా అయ్యాయి. కానీ, మన రాష్ట్రంలో ఇప్పటికీ పింఛన్ల పెంపకంపై ఎటువంటి అప్డేట్‌ లేకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link