Gold Price Today In Hyderabad 31 May 2021: మిశ్రమంగా బంగారం ధరలు, రూ.5,000 మేర పుంజుకున్న వెండి ధర

Mon, 31 May 2021-10:38 am,

Gold Rate Today 31 May 2021: బులియన్ మార్కెట్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో ధర పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకుంది. విజయవాడ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రూ. 5000 మేర పెరగడం గమనార్హం. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Gold Rate Today In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,820 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,870 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,870కు చేరుకుంది.

Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఢిల్లీలో పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.400 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.72,000కు చేరుకుంది. విజయవాడలో రూ.5,200 మేర వెండి భారీగా పుంజుకుంది. విజయవాడలో 1 కేజీ వెండి ధర రూ.76,800 అయింది. హైదరాబాద్‌లో రూ.400 మేర పెరగడంతో తాజాగా 1 కేజీ ధర రూ.72,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link