Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పసిడి దారిలోనే వెండి!

Fri, 01 Jan 2021-12:52 pm,

Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తాజా మరోసారి బంగారం ధర (Gold Price Today) స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి స్థిరంగా ఉన్నాయి.

Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర నిన్నటిలాగే రూ.51,060 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800 వద్ద మార్కెట్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధర (Gold Price Today) వారం రోజుల నుండి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,310 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,860గా ఉంది.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

బంగారం ధరలతో పోటీపడి మరి వెండి ధరలు పెరుగుతున్నాయి. మిశ్రమ ధరలను నమోదు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర తాజాగా రూ.300 మేర దిగొచ్చింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,100 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర స్వల్పంగా పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,400కి చేరింది.  

Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link